సేవా సంస్థ ‘ప్రయాస్’ను ప్రారంభించిన ఉపాసన(పిక్చర్స్)
హైదరాబాద్: యువ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో పేద ప్రజల ఉన్నతి కోసం నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమం ‘ప్రయాస్'ను ప్రముఖ సినీనటుడు రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన కామినేని జూబ్లీహిల్స్లో మంగళవారం ప్రారంభించారు. ప్రయాస్ నిధులను సేకరించడానికి సెప్టెంబర్ 5న పంకజ్ ఉదాస్ ఆధ్వర్యంలో గజల్ షోను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
‘వి కనెక్ట్' అనే నినాదంతో ప్రయాస్ సభ్యులు ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను
విద్యానగర్లోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఒకేషనల్ ట్రైనింగ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ హ్యాండికాప్డ్ స్కూల్కు, మలక్ పేటలోని జిహెచ్ఎస్ బ్లైండ్ గర్ల్స్ స్కూల్కు అందజేయడం జరుగుతుందని చెప్పారు.
సైనిక్పురిలోని చైల్డ్ గాడ్ గ్రేస్ సొసైటీ వికలాంగులకు క్రీడా సామాగ్రిని అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సమాజంలోని ప్రజలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రయాస్ ప్రెసిడెంట్ కరిష్మా జైన్, వైస్ ప్రెసిడెంట్ షాజ్ మహ్మూద్, జనరల్ సెక్రటరీ నమిత్ నరెన్ జైన్, జాయింట్ సెక్రటరీ అంకిత్ అగర్వాల్, ట్రెజరర్ ప్రీతి జైన్, తదితరులు పాల్గొన్నారు.

ఉపాసన
యువ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో పేద ప్రజల ఉన్నతి కోసం నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమం ‘ప్రయాస్'ను ప్రముఖ సినీనటుడు రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన కామినేని జూబ్లీహిల్స్లో మంగళవారం ప్రారంభించారు.

ఉపాసన
ప్రయాస్ నిధులను సేకరించడానికి సెప్టెంబర్ 5న పంకజ్ ఉదాస్ ఆధ్వర్యంలో గజల్ షోను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఉపాసన
‘వి కనెక్ట్' అనే నినాదంతో ప్రయాస్ సభ్యులు ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను
విద్యానగర్లోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఒకేషనల్ ట్రైనింగ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ హ్యాండికాప్డ్ స్కూల్కు, మలక్ పేటలోని జిహెచ్ఎస్ బ్లైండ్ గర్ల్స్ స్కూల్కు అందజేయడం జరుగుతుందని చెప్పారు.

ఉపాసన
సైనిక్పురిలోని చైల్డ్ గాడ్ గ్రేస్ సొసైటీ వికలాంగులకు క్రీడా సామాగ్రిని అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఉపాసన
ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సమాజంలోని ప్రజలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications