Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశాన్ని అవినీతిమయం చేస్తున్నారు: ప్రధాని మోడీపై వీహెచ్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని అవనీతిమయం చేస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావు ఆరోపించారు. మోడీ వైఖరి, కేంద్ర మంత్రుల అవినీతిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా మడికొడంలో గురువారం భారీ ధర్నా నిర్వహించింది.

ఈ ధర్నాలో పాల్గొన్న వి హనుమంతురావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కుంభకోణాలు వెలుగుచూసినా మోడీ నోరు విప్పడం లేదన్నారు. ప్రధాని మోడీ ఇష్టమొచ్చినట్లు వ్వవహారిస్తూ, ప్రజాస్వామ్య విలువలను అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

V Hanumantha rao fires on prime minister narendra modi

గతంలో మౌనముని అని మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌ను ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ, దేశంలో జరుగుతున్న కుంభకోణాలపై ఇప్పుడు తనెందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దయెత్తున తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+