అప్పుడే భానుడి భగభగలు.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్!
రాష్ట్రంలో అప్పుడే భానుడి భగభగలు ప్రారంభం అయ్యాయి. మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి. నిన్న ములుగు జిల్లా మంగపేటలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీల సెల్సియస్ పైన రికార్డయ్యాయి.
ఈ ఏడాది అధిక ఎండలను అంచనా వేసిన ఐఎండీ
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 2.2డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండటంతో అప్పుడే పగటిపూట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది అధిక ఎండలను అంచనా వేసింది.ప్రజలు ఎండలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత ఎండలు పెరుగుతాయి. కానీ ఈసారి తొలి వారంలోనే వేడి తీవ్రత మొదలైంది.

ఈ వారం సగటు ఉష్ణోగ్రతలిలా.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
ఈ వారంలో సగటు ఉష్ణోగ్రతలు 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని అధికారులు సూచించారు. ఇక నేడు ఆరు జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలే కాకుండా మిగిలిన 27 జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా. అయితే, కుమురం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి జిల్లాల్లో 39.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.
ఉష్ణోగ్రత తక్కువున్నా వేడి తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్
మన చుట్టూ పెరిగిన కాలుష్యం కూడా ఎండ తీవ్రతలకు కారణంగా చెప్తున్నారు వాతావరణ శాఖాధికారులు. కాలుష్యమున్న చోట ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా వేడి ఎక్కువగా అనిపిస్తుందని చెప్తున్నారు.ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగినప్పటికీ, నాలుగు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని చెప్తున్నారు.ఎండల తీవ్రత నుంచి రక్షణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖాధికారులు సూచనలు చేస్తున్నారు. మధ్యాహ్నం బయట తిరగకుండా ఉండాలని, పుష్కలంగా నీరు తాగాలని సూచిస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!













Click it and Unblock the Notifications