వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ వెంట కాంగ్రెస్‌లో చేరిన వారు వీరే, కేసీఆర్‌కు షాకిచ్చిన నేతలు

రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేది వీళ్లే! : Full List | Oneindia Telugu

న్యూఢిల్లీ: రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే షాక్?కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే షాక్?

రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. తమ పార్టీలో చేరాలనుకునే వారికి తాము సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. రేవంత్ చేరికపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారని, కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తున్నందుకు ఆనందించారన్నారు. పదవుల విషయంలో సాధ్యమైనంత వరకు అందరికీ న్యాయం చేస్తామన్నారు.

 మధ్యాహ్నం 3 గంటలకు అన్నీ మాట్లాడుతాం

మధ్యాహ్నం 3 గంటలకు అన్నీ మాట్లాడుతాం

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ సహా ఇతర నేతలు చేరినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని ఉత్తమ్ అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు మాట్లాడుతామని చెప్పారు.

కాంగ్రెస్‌లో

కాంగ్రెస్‌లో

కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని, అంద‌రూ ఐక్యంగా ఉన్నార‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఉత్తమ్ చెప్పారు. 2019లో అధికారం త‌మ‌దేన‌ని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి కూడా ప‌లువురు నేత‌లు త‌మ పార్టీలో చేరార‌ని అన్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి కూడా కొంద‌రు చేరారని చెప్పారు.

 రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు వీరే

రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన నేతలు వీరే

రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సీతక్క, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్ధన్, సోయం బాపూరావు, కె సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, రాజారాం యాదవ్, జంగా యాదవ్, హరిప్రియ నాయక్, విజయ రమణా రావు, పటేల్ రమేష్ రెడ్డి, జంగయ్య, మేడిపల్లి సత్యం, హరిప్రియ నాయక్ తదితరులు చేరారు.

 టీఆర్ఎస్ నుంచి చేరినవారు

టీఆర్ఎస్ నుంచి చేరినవారు

దొమ్మాట సాంబయ్య, ఓయు జేఏసీ నుంచి జరు ఎల్లన్న, బాల లక్ష్మి, భాస్కర్, మధుసూదన్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, చిన్నారెడ్డి, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి, యువజన నేత అనిల్ యాదవ్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు ఉన్నారు.

English summary
Who joined Congress along with Revanth Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X