'కేసీఆర్కు ఏం ప్రమాదమని రూ.5కోట్ల అత్యాధునిక టెక్నాలజీ బస్సు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏం ప్రమాదం ఉందని రూ.5 కోట్లు పెట్టి అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సాంకేతికమైన బస్సును సొంతం చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు శుక్రవారం నాడు ప్రశ్నించారు.
వీ హనుమంత రావు ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీని వీడిన డీ శ్రీనివాస్ అంశంపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు డీఎస్ను అందరూ ఛీ అంటన్నారన్నారు.
డీఎస్ అవకాశవాది అన్నారు. ఆయన పార్టీ నుండి వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. తమ పార్టీకి పీడ విరగడయిందన్నారు. డీఎస్ ఎన్నికల్లో ఓడినప్పటికీ సోనియా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. అనేక పదవులు కట్టబెట్టారన్నారు.
అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ వీడటం సరికాదన్నారు. లలిత్ మోడీ వంటి అవినీతిపరులను ప్రధాని మోడీ కాపాడుతున్నారన్నారు. అవినీతి మంత్రులు, ప్రజా వ్యతిరేక పాలన పైన రాష్ట్రాల్లో ఆందోళన చేపట్టాలని తాను సోనియాకు విజ్ఞప్తి చేశానని చెప్పారు.

బస్సు
తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనల కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సు హైదరాబాదుకు వచ్చింది. జార్ఖండ్లో ఐదు కోట్ల రూపాయలతో ఈ బస్సును తయారు చేయించారు.

బస్సు
ఇందులో సెంట్రలైజ్ ఏసీతో పాటు బెడ్ రూం, బాత్ రూం, అధికారులతో మాట్లాడేందుకు చిన్న సమావేశపు హాల్, ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు బస్సు పైకి మెట్లు ఉన్నాయి.

బస్సు
బస్సుపై సీఎంతో పాటు ఇతర నేతలు, సెక్యూరిటీ నిలబడేలా అన్ని హంగులతో ముస్తాబయింది. లక్ష మందికి పైగా స్పష్టంగా వినబడేలా సౌండ్ సిస్టమ్ అమర్చారు. అంతేకాక, బస్సులో ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు.

బస్సు
బస్సులో సెన్సార్లతో ఫైర్ సేఫ్టీ పరికరాలు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సెక్యూరిటీ అధికారులు ఉండేందుకు కేబిన్లు, హైకెపాసిటీ బ్యాటరీలు, జనరేటర్స్ ఉంటాయి. చండీగఢ్ మెర్సిడెడ్ బెంజ్ ప్రత్యేకంగా అత్యాధునిక సౌకర్యాలు కలిగిన టెక్నాలజీ బస్సును తయారు చేసింది.

వీహెచ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏం ప్రమాదం ఉందని రూ.5 కోట్లు పెట్టి అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సాంకేతికమైన బస్సును సొంతం చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు శుక్రవారం నాడు ప్రశ్నించారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications