పార్టీ మారిన ఎమ్మెల్యేలను చీరీ చింతకు వేయాలని అన్నారు...
గతంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలను చీరి చింతకు కట్టాలని నీతులు వళ్లించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ప్రశ్నించారు.12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే ఎందుకు స్పందించడం లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపులు రాజకీయ వ్యభిచారమేనన్న కేసీఆర్ ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా అని మండిపడ్డారు.
ఈనేపథ్యంలోనే పార్టీలు మారీ రాజకీయ వ్యభిచారం చేస్తున్న ఎమ్మెల్యేలను ,చేయిస్తున్న నాయకులను ఏమానలని ప్రశ్నించారు.ఇక జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచామని చెబుతున్న టీఆర్ఎస్ పార్టీ... 6 సిట్టింగ్ ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని అన్నారు.అందులో సీఎం కూతురు కవిత కూడ ఉంది కాదా అని అన్నారు. మరోవైపు అభివృద్ది కోసమే పార్టీ మారమని చెబుతున్న వారు పార్టీ మారకపోతే అభివృద్ది జరగదా అని అన్నారు.
ఇక పార్టీ మారిన వారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని , కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్లు తీసుకుని ఎన్నికల్లో గెలిచమన్న విషయాన్ని మర్చి పోయారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.