దారుణం: మహిళ దుస్తులు విప్పేసి, మూత్రం తాగించారు
నిజామాబాద్: పాతకక్షలతో ఓ మహిళను చిత్రహింసలు చేయడమే కాకుండా వివస్త్రను చేసి, మూత్రం తాగించిన సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన లక్ష్మి, పోశెట్టి దంపతులు. మనస్పర్థల కారణంగా వారు దాదాపు ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్నారు.
రెండు రోజుల క్రితం పోశెట్టి ఇంటివద్ద చిన్న ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో లక్ష్మి బంగారు గొలుసు కనిపించకుండా పోయింది. గురువారం రాత్రి లక్ష్మి తన గొలుసు కనిపించడం లేదని వెతుక్కుంటూ పోశెట్టి ఇంటి వద్దకు వచ్చింది. పోశెట్టి, అతని కుటుంబ సభ్యులు లక్ష్మిని తాళ్లతో బంధించి తీవ్రంగా కొట్టారు.
అనంతరం ఆమెను వివస్త్రను చేశారు. మంచినీరు అడిగితే బలవంతంగా మూత్రం తాగించారు. చిత్రహింసలకు గురి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అనంతరం ఆసుపత్రిలో చేరారు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ ఢీకొని ఒకరి మృతి
కరీంనగర్ జిల్లాలో వేగంగా వెళ్తున్న లారీ ఓ ట్రాక్టరును ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. హుజురాబాద్ మండలంలోని సింగపూర్లో లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది.
బాలికపై అత్యాచారయత్నం
నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం సోమారంలో పదమూడేళ్ల బాలిక పైన శనివారం రాత్రి సైదులు అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.