మద్యం తాగించి స్త్రీపై గ్యాంగ్ రేప్: వివాహితపై టీచర్ లైంగిక దాడి, లేట్ నైట్ రోమియోస్
హైదరాబాద్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్లో వితంతువుకు(45) రెండు రోజుల కిందట మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఖమ్మంలోని ఆ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా వుంటే, ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహితపై లైంగికదాడి జరిగింది. సిర్పూర్(యు) లింగాపూర్ మండలం భీంరావ్ కంచన్పల్లి పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదే మండలంలోని ఓ తండాకు చెందిన వివాహిత(35)కు సోమవారం మాయమాటలు చెప్పి పాఠశాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో సౌత్జోన్ పోలీసులు మంగళవారం రాత్రి ఆపరేషన్ లేట్నైట్ రోమియోస్ నిర్వహించారు. అందులో భాగంలోఅర్ధరాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న 158 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సౌత్జోన్ డీసీపీ తెలిపారు.
నగరంలో రాత్రి సమయంలో కొంతమంది యువకులు మద్యం తాగి హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి ఆకతాయిల ఆగడాలు కట్టించేందుకు చేపట్టిన చర్యలో భాగంగానే ఆపరేషన్ లేట్నైట్ రోమియోస్ నిర్వహించినట్లు తెలుస్తోంది.