కాలేజీలో అమ్మాయిలను వేధిస్తున్న ముగ్గురు ఉద్యోగాలు
యువతుల పైన లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, హైదరాబాదులోని ఓ కాలేజీలో అమ్మాయిలను వేధించిన సంఘటన సోమవారం నాడు వెలుగు చూసింది.
హైదరాబాద్: యువతుల పైన లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, హైదరాబాదులోని ఓ కాలేజీలో అమ్మాయిలను వేధించిన సంఘటన సోమవారం నాడు వెలుగు చూసింది.
ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ముగ్గురు ఉద్యోగులు అమ్మాయిలను వేధిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి పేర్లు గోపి, సైదా రెడ్డి, సుమన్లుగా తెలుస్తోంది.
దీంతో కాలేజీ విద్యార్థులు ఉదయం నుంచి కాలేజీ బయట కూర్చొని ఆందోళనకు దిగారు. తమను ఆ ముగ్గురు ఉద్యోగాలు లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని పలువురు అమ్మాయిలు ఆరోపించారు. వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
English summary
Women face harassment in college in Hyderabad. College students stage dharna infront of college.
Story first published: Monday, February 27, 2017, 19:14 [IST]