రాజకీయాల కోసం రాష్ట్రాలు తిరుగుతారు; చనిపోయిన రైతుకుటుంబాలను ఆదుకోరు: విరుచుకుపడిన వైఎస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ ప్రభుత్వ తీరుపై వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సీఎం కేసీఆర్ చోద్యం చూస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగామరోమారు సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్ షర్మిల.
Recommended Video

తెలంగాణాలో మిర్చి రైతుల కష్టాలపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలపై సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కెసిఆర్ పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. తామర తెగులు సోకి, అకాల వర్షాలకు మిర్చి రైతు నష్టపోతే ఆదుకోవాల్సిన సర్కార్ పరామర్శతోనే సరిపెట్టుకొంటే, సాయం కోసం ఎదురుచూసిన మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు, అయినా సీఎం కేసీఆర్ కు సోయి లేదని షర్మిల పేర్కొన్నారు.

రాజకీయాల కోసం రాష్ట్రాలు తిరుగుతారు , చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోరు
ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే మూడు నెలల్లోనే 17 మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మీ రాజకీయాల కోసం రాష్ట్రాలు తిరుగొచ్చు, గ్రూప్ లు కట్టచ్చు కానీ చనిపోతున్న రైతు కుటుంబాలను ఆదుకోరు అంటూ నిప్పులు చెరిగారు. మీ బంగారు తెలంగాణ బూటకమౌతుందని వారిని పరామర్శించడం లేదా? అని షర్మిల నిలదీశారు. సొంత రాష్ట్ర రైతు అవస్థ తీర్చలేని మీరు దేశంలోని రైతులందరికీ ఏం సమాధానం చెప్తారు అంటూ షర్మిల సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు.

తెలంగాణా రైతులనే ఆదుకోలేని మీరు దేశ రైతులను ఆదుకుంటారా ?
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో సొంత రాష్ట్రంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదంటూ, రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదంటూ షర్మిల మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలను తీర్చలేని కెసిఆర్, దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కష్టాలను తీరుస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పుకోవడం బూటకమని మండిపడ్డారు.

పెద్ద దొర, చిన్న దొరా, చూడండి మీ నాయకుల బాగోతం
అంతకుముందు సీఎం కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన షర్మిల బాలికపై అత్యాచారానికి పాల్పడిన టిఆర్ఎస్ నాయకుడు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆడ పిల్లల వంక చూస్తే గుడ్లు పీకేస్తాం, లంచాలు అడిగితే గల్లాపట్టి కొట్టండి అని చెప్పిన పెద్ద దొర, చిన్న దొరా, చూడండి మీ నాయకుల బాగోతం అంటూ టిఆర్ఎస్ నాయకుడి అత్యాచార ఉదంతాన్ని టార్గెట్ చేశారు. లంచంగా అమ్మాయిల మానాన్ని అడుతున్నారు. ఇండ్లు ఇప్పిస్తామని అమాయక అమ్మాయిలను లోబర్చుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కంచే చేను మేసినట్టు పరిస్థితి.. మహిళలకు రక్షణ ఎక్కడిది?
కంచే చేను మేసిందన్నట్లు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వంలోని పెద్దలే గద్దల్లా అమ్మాయిల మాన ప్రాణాలు పీక్కు తింటుంటే ఇంకెక్కడిది మహిళలకు రక్షణ? అని ప్రశ్నించారు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా మీ నాయకుల తప్పులు మీ కండ్లకు కనపడవు అని అసహనం వ్యక్తం చేశారు. మీ చట్టానికి దొరకవు అని మండిపడ్డారు. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరుగకూడదంటే, గుడ్లు పీకాల్సింది మీవా? మీ నాయకులవా? మీరే తేల్చుకోండి అంటూ షర్మిల తీవ్రస్థాయిలో కెసిఆర్ పై ధ్వజమెత్తారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications