వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ తప్పుని సరిదిద్దుకొని ధరణి పంచాయితీలు తెంపండి: కేసీఆర్ కు వైఎస్ షర్మిల సలహా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కు బిజెపి-కాంగ్రెస్ ల తో పాటు మరో తలనొప్పిగా తయారైంది వైయస్సార్ తెలంగాణ పార్టీ. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ పార్టీని స్థాపించి, ప్రజా సమస్యల కోసం పోరాటం సాగిస్తున్నారు. రైతు సమస్యల కోసం, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న షర్మిల నిత్యం తెలంగాణ సీఎం కేసీఆర్ ను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సోషల్ మీడియా ను వేదికగా చేసుకున్న షర్మిల రోజుకో అంశంపై తెలంగాణ సర్కార్ ను ఇరకాటంలో పెడుతున్నారు. సీఎం కేసీఆర్ కు ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు.

 ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి ధరణి భూ సమస్యల పరిష్కారం పై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని షర్మిల సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ కారణంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని, హత్యలకు కూడా పాల్పడుతున్నారంటూ వైయస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తో పనికిమాలిన పని చేశారని మండిపడ్డారు.

ధరణితో యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారు

ధరణితో యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారు


ధరణి భూ సమస్యల పరిష్కారానికి మంత్రదండం అని చెప్పుకున్న కేసీఆర్ గారు, ఉన్న సమస్య పరిష్కారమేమో కానీ లేని సమస్యలను సృష్టించారు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. భూమి ఉన్నోళ్లకు లేనట్టు, లేనోళ్లకు ఉన్నట్టు చూపెడుతూ యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారు అని వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు.భూమి కోసం అధికారుల చుట్టూ తిరగలేక లంచాలు ఇచ్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. అర్ధాంతరంగా చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారని వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు

ధరణి పోర్టల్ వల్ల భూముల కోసం హత్యలు చేసుకుంటున్నారు..

ధరణి పోర్టల్ వల్ల భూముల కోసం హత్యలు చేసుకుంటున్నారు..

కాస్తు కాలాన్ని ఎత్తేస్తే పాత పేర్ల మీద రికార్డులు చూపటంతో ఆ భూముల కోసం హత్యలు చేసుకుంటున్నారు అని షర్మిల ఆరోపించారు.లోపాలు ఉన్నాయని మీరే ఒప్పుకొన్నా వాటిని పరిష్కరిస్తే మీ పనికిమాలిన పని ఈ ధరణి పోర్టల్ అని తేలిపోతుందని భయపడుతున్నారా? అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. మీ తప్పుని సరిదిద్దుకొని ధరణి పంచాయితీలు తెంపండి అని వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ కు డిమాండ్ చేశారు.

Recommended Video

YSR Telangana Party celebrates registration by EC | Oneindia Telugu
వెంటనే ధరణి పంచాయితీలు తెంచండన్న షర్మిల

వెంటనే ధరణి పంచాయితీలు తెంచండన్న షర్మిల

ఇక ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి ధరణి విషయంలో రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న కర్ణం గూడా హత్యలకు కూడా భూవివాదాలు కారణమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అక్రమాలు విపరీతంగా పెరిగాయని, పాత భూయజమానులకు హక్కులు ఇవ్వడం ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. ధరణి పోర్టల్ ను అడ్డంపెట్టుకుని నిజాం కాలం నాటి భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఇక తాజాగా ధరణి పోర్టల్ విషయంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వైయస్ షర్మిల కూడా తీవ్ర విమర్శలు చేశారు. వెంటనే ధరణీ పంచాయతీలు తెంచాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
YS Sharmila criticized the increase in land disputes in the state due to the Dharani portal and said that Dharani was responsible for suicides and murders, CM KCR needs to rectify this mistake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X