టీటీడీ మరో కీలక నిర్ణయం .. భక్తుల సంఖ్య పెంచేలా, స్థానిక ఆలయాలపై విస్తృత ప్రచారం
టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాల ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేసి భక్తుల సంఖ్యను పెంచాలని టిటిడి కసరత్తులు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని స్థానిక ఆలయాల ప్రశస్త్యాన్ని భక్తులందరికీ తెలియజేస్తూ, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక్తుల సంఖ్య పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Recommended Video

స్థానిక ఆలయాలపై ప్రచారం సాగించనున్న టీటీడీ
టిటిడి పరిపాలన భవనంలో స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష జరిపిన ఈవో స్థానిక ఆలయాలపై ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. టిటిడి స్థానిక ఆలయాలకు సంబంధించిన స్థల పురాణాన్ని, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ టిటిడి వెబ్సైట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా తిరుపతిలోనూ, తిరుమలలోనూ భక్తులు బస చేసే నివాసాల వద్ద టిటిడి పరిధిలోని స్థానిక ఆలయాల గురించి ప్రచార ఏర్పాట్లు చేయాలని, హోర్డింగ్స్ పెట్టాలని సూచించారు.

హోర్డింగులు, బుక్ లెట్లతో ప్రచారం
ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఆలయాల గురించి భక్తులకు తెలిసేలా ప్రచార ఏర్పాట్లు చేయాలని చెప్పారు. టూరిజం, ఆర్టీసీ అధికారులతో సంప్రదింపులు జరిపి ప్యాకేజీ టూర్లను ఏర్పాటు చేయించాలని సూచించారు. ఇదే సమయంలో స్థానిక ఆలయాల అవసరాలను బట్టి సేవలు ప్రవేశపెట్టాలని కూడా భావిస్తున్నారు. ప్రతి ఆలయానికి సంబంధించి ఒక బుక్ తయారు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఈవో జవహర్ రెడ్డి సూచించారు

చిత్తూరు జిల్లాలో చాలా పురాతన దేవాలయాలు .. వాటి ప్రాముఖ్యత తెలిసేలా ప్రచారం
చిత్తూరు జిల్లాలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి, ఇవి యాత్రికులకు పెద్దగా తెలియదు. ఇక అలాంటి వాటికి ప్రాధాన్యత కలిగేలా స్థానిక దేవాలయాలను ప్రధాన తీర్థయాత్రలుగా మార్చడానికి టీటీడీ కొత్త ప్రయత్నం చేస్తోందని ఈ నిర్ణయం ద్వారా తెలుస్తోంది. భక్తుల సౌలభ్యం కోసం శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట ఆలయంలో కల్యాణకట్టలు ఏర్పాటు చేయాలని టిటిడి భావిస్తోంది. టీటీడీ అనుబంధ విలీన ఆలయాలకు సంబంధించిన వ్యవసాయ భూములను ఖాళీగా ఉంచరాదని ఎప్పటికప్పుడు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.

స్థానిక ఆలయాల ఆదాయం పెరిగేలా .. భక్తులు ఎక్కువగా వచ్చేలా ప్రణాళిక
ఆలయాలకు కానుకగా వచ్చే గోవుల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఇదే సమయంలో ఆలయ భూములకు సంబంధించి వ్యవసాయం చేస్తున్న రైతులతో మాట్లాడి తిరుమల ఆలయ ప్రసాదాల తయారీకి పంటలను అందించేలా చూడాలని పేర్కొన్నారు.ఆలయాల ఆదాయం భక్తుల సంఖ్యను బట్టి గ్రేడ్లుగా విభజించాలని సూచించారు. స్థానిక విలీన ఆలయాలకు సంబంధించి మంజూరు చేసిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. తిరుమల టూరిజం అభివృద్ధికి, భక్తులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా స్థానిక దేవాలయాలకు ఉన్న ప్రాముఖ్యత తెలియజేస్తే స్థానిక ఆలయాలకు సైతం భక్తుల సంఖ్య పెరుగుతుందని టిటిడి భావిస్తోంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications