విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నదాతలు నేరస్థులు కాదు ..జగన్ గారూ అన్న కేశినేని నానీ

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ ను కేశినేని నానీ ప్రజా సమస్యలపైన ప్రశ్నిస్తూనే ఉన్నారు . పిచ్చోడి చేతిలో రాయి మీ చేతిలో పాలన అంతే అని జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన నానీ ఇప్పుడు అన్నదాతలు నేరస్థులు కాదని వారిని రక్షించాలని జగన్ ను కోరుతూ పోస్ట్ చేశారు.

దమ్ముంటే వీటిపై ట్వీట్ చెయ్ .. నువ్వా నీతి సూత్రాలు వల్లించేది .. విజయసాయిపై దేవినేని ఫైర్దమ్ముంటే వీటిపై ట్వీట్ చెయ్ .. నువ్వా నీతి సూత్రాలు వల్లించేది .. విజయసాయిపై దేవినేని ఫైర్

కేశినేని నాని తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నానీ సవాల్ విసిరారు. బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ జాప్యంపై కేశినేని నాని ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . జగన్‌కు చేతకాకపోతే చెప్పాలని.. తాను చేసి చూపిస్తానని కేశినేని నానీ జగన్ కు చాలెంజ్ చేశారు . ఇక ఈ రోజు అన్నదాతల విషయంలో జగన్ గారూ అంటూ నానీ ట్వీట్ చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ ఎంపీ కేశినేని మరోసారి విమర్శలు చేసిన నానీ కృష్ణా జిల్లా నందిగామలో న్యాయపోరాటం చేస్తున్న రైతులను పోలీసులు కొట్టి వారిని పోలీస్ స్టేషన్ కు లాక్కువెళ్తున్నారని పేర్కొన్నారు. వారిపై దొంగ కేసులు నమోదు చేస్తున్నారన్న సమాచారం తమకు ఉందని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ వెంటనే స్పందించి రైతులను రక్షించాలని, వాళ్లు నేరస్థులు కాదు 'అన్నదాతలు' అని కేశినేని నాని ఓ ట్వీట్ లో జగన్ కు అర్ధం అయ్యేలా చెప్పారు .

Farmers are not criminals .. jagan garu said keshineni nani

ప్రజా సమస్యలను, ప్రతిపక్ష పార్టీల తీరును , అవసరం అనుకుంటే సొంత పార్టీ నేతల తీరును సోషల్ మీడియా వేదికగా అందరికీ అర్ధం అయ్యేలా పోస్ట్ పెడుతున్నారు కేశినేని నానీ. ఇక ఈ పోస్ట్ లే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడు ఎవరు ఏ పోస్ట్ పెట్టి సంచలనానికి తెర తీస్తారో అన్న ఆసక్తి ప్రస్తుతం ఏపీలో ఉంది . అలా ట్రెండ్ ను మార్చేశారు విజయసాయిరెడ్డి, నారా లోకేష్, కేశినేని నానీ వంటి నేతలు.

English summary
Keshineni Nani has recently criticized AP Chief Minister Jagan. TDP MP Kesineni said that the YCP government in AP is not working in the favour of farmers , Nani said Krishna district police in Nandigama has beaten the farmers and dragged them to the police station. Keshineni said that he have information that police are keeping false cases against them. Nani asked Jagan to respond immediately and protect the farmers because they are not criminals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X