ప్రకాశం బ్యారేజ్ కి మళ్ళీ వరద .. ఈ సారి తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలే కారణం
మొన్నటి వరకు అంతర్రాష్ట్ర వరదల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తితే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు ,వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా వరద నీరు మరోసారి ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తనుంది.ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద మొదలైంది.

ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు , మధిర వాగులు .. కృష్ణా నదికి చేరుతున్న వరద నీరు
మున్నేరు, మధిర వాగుల నుంచి వరద నీరు కృష్ణానదికి చేరుతుంది .ఈ రెండు వాగుల నుంచి 30వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వస్తోంది. బ్యారేజీ నిర్వహణ అధికారులు మొత్తం 20 గేట్లను అడుగు మేర ఎత్తారు. వీటితో 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 18,500 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తుండగా, మరో 14,500 క్యూసెక్కుల నీటిని సాగు నీటి కాల్వలకు ఇస్తున్నారు.
ఇటీవల ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో వచ్చిన కృష్ణా నది వరదల కారణంగా సుమారుగా 300 టీఎంసీల సముద్రంలోకి వెళ్లింది. బ్యారేజీ ఎగువ, దిగువ భాగాలు జలకళను సంతరించుకున్నాయి.

ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సురక్షితం కాదన్న అధికారులు
ఇక తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఇటీవల వరదల నాటి పరిస్థితి పునరావృతమయ్యే లా కనిపిస్తుంది. మరో రెండు, మూడు రోజులపాటు ఖమ్మం జిల్లా నుంచి వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు..వరద కారణంగా వినాయక నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. ప్రతి సంవత్సరం ప్రకాశం బ్యారేజీకి దిగువన విగ్రహ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తారు. కానీ వరద నీరు పోటెత్తడంతో, బ్యారేజీ 20 గేట్లను ఎత్తడంతో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సురక్షితం కాదని అధికారులు భావిస్తున్నారు
.

శ్రీశైలం జలాశయానికి పోతెట్టుతున్న వరద .. 29 వేల 110 క్యూసెక్కుల నీరు విడుదల
ఇక మరోవైపు శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 7,696 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 24,500 క్యూసెక్కులు, హంద్రీ-నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం జలాశయం నుండి 29 వేల 110 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక గడచిన 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో 5.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే మరోమారు క్రిష్ణమ్మ ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాలను ముంచేసే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications