విజయవాడవాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్: బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్పై ట్రయల్ రన్ షురూ
విజయవాడ: విజయవాడవాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. వారి కల నెరవేరింది. ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. నిత్యం వాహన రద్దీతో కిటకిటలాడే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పార్ట్ 2 ఇక అందుబాటులోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు అధికారులు. దీనితో వాహనాలు రయ్మంటూ దూసుకెళ్తోన్నాయి. భారీ వాహనాలు సైతం ఈ ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. వచ్చేనెల లాంఛనప్రాయంగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరో ఆఫ్ఘనిస్తాన్: ఇరాక్ ప్రధాని హత్యకు భారీ కుట్ర: నివాసంపై బాంబుల వర్షం
చెన్నై-కోల్కత జాతీయ రహదారిపై..
చెన్నై-కోల్కత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ను నిర్మించింది. బెంజ్ సర్కిల్ వద్ద నిర్మించిన రెండోె ఫ్లైఓవర్ ఇది. గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఇది రూపుదిద్దుకుంంది. నిర్మల కాన్వెంట్, రమేష్ ఆసుపత్రి మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్తుంది. ఫలితంగా- బెంజ్ సర్కిల్ వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాత్రివేళల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంటుంది. ఈ ట్రాఫిక్ గండాన్ని గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం- జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఈ ఫ్లైఓవర్లలను నిర్మించింది.
భారత్మాల ప్రాజెక్ట్లో భాగంగా..
భారత్మాల ప్రాజెక్ట్లో ఈ రెండు ఫ్లైఓవర్లు భాగం. 2017లో ఈ రెండింటి నిర్మాణానికి కేంద్రం శంకుస్థాపన చేసింది. ఈ రెండింట్లో ఓ ఫ్లైఓవర్ ఇదివరకే వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. గన్నవరం నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలన్నీ ఈ ఫ్లైఓవర్ మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే బెంజ్ సర్కిల్ మీదుగా రెండో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా కొద్దిరోజుల కిందటే తుదిదశకు చేరుకున్నాయి. తాజాగా ఈ ఫ్లైఓవర్పై ట్రయల్ రన్ మొదలు పెట్టారు.
రూ.90 కోట్లతో..
ఈ ఫ్లైఓవర్ పొడవు.. 2.7 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం సుమారు 90 కోట్ల రూపాయలు. వచ్చే సంవత్సరం మే నాటికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పట్లో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అధికారులు. నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది ఈ రెండో ఫ్లైఓవర్. దీనితో ట్రయల్ రన్ను కూడా మొదలు పెట్టారు. లాంఛనప్రాయంగా వచ్చేనెల ప్రారంభించే అవకాశం ఉంది.
Recommended Video
ఇటీవలే పనులను పర్యవేక్షించిన కేశినేని నాని..
తుది దశకు చేరుకున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కొద్దిరోజుల కిందటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, స్థానిక లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఈ ఉదయం సందర్శించారు. టీడీపీకే చెందిన విజయవాడ తూర్పు శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్, కృష్ణా జిల్లా రోడ్డు-రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యత పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.