సీఐడీ నోటీసులపై హైకోర్టుకు చంద్రబాబు- క్వాష్ పిటిషన్ దాఖలు- ఎఫ్ఐఆర్ కొట్టేయాలని
తనపై దాఖలైన సీఐడీ అట్రాసిటీ కేసును సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సీఐడీ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ తనపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరికాదని చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను కేబినెట్ తీర్మానం లేకుండా మార్చిన వ్యవహారంలో అప్పటి సీఎం, ప్రస్తుత విపక్ష నేత చంద్రబాబుపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని సీఐడీకి వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెలలో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 24న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సీఐడీ.. 25న చంద్రబాబుతో పాటు మరికొందరిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

అమరావతి అసైన్డ్ భూముల మార్పిడి విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎఫ్ఐర్ నమోదు చేసిన సీఐడీ.. ఈ నెల 23న విజయవాడలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది. మరోవైపు చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈ కేసులో మరింత సమాచారం ఇచ్చేందుకు ఇవాళ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !!












Click it and Unblock the Notifications