టీడీపీలో చిచ్చుపెట్టిన ప్రజావేదిక కూల్చివేత ... ఆందోళన తప్పు , బాబు భజన ఆపండి అన్న టీడీపీ నేత
ప్రజా వేదికపై టీడీపీ నేతల్లోనే భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్ళలోనే బేధాభిప్రాయాలు ఉన్నాయి. ఒక పక్క ప్రజా వేదిక కూల్చివేత జరుగుతుంటే మరో పక్క తెలుగుదేశం నేతలు తలా ఒక వాదన వినిపిస్తున్నారు . సీనియర్లు సైతం ప్రజా వేదిక భవనాన్ని కూల్చివేయడాన్ని తప్పుబడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు . మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాత్రం ప్రజా వేదిక కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేయడాన్ని సరైంది కాదని తేల్చి పారేశారు.ఇటీవల తోట త్రిమూర్తులు వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్న వేళ టీడీపీలోనే ఉంటూ టీడీపీ నేతల అభిప్రాయాలకు భిన్నంగా ఆయన తన అభిప్రాయం వెల్లడించారు.
బుధవారం నాడు తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు. ప్రజా వేదికను కూల్చివేయడంపై స్పందించిన త్రిమూర్తులు చంద్రబాబు మెప్పు కోసం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళన చేస్తున్నారని మండిపాటుకు గురయ్యారు . ఇక ఇప్పటికైనా టీడీపీ నేతలు చంద్రబాబుకు భజన చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ నేతలు మారకపోతే ప్రజలు క్షమించరని త్రిమూర్తులు అభిప్రాయపడ్డారు.ప్రజా వేదిక కూల్చివేతను నిరసిస్తూ ఆందోళన చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన అనూహ్య వ్యాఖ్యలు చేశారు .

ఇటీవల కాకినాడ వేదికగా టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో రహస్య భేటీకి కీలక భూమిక పోషించారు తోట త్రిమూర్తులు . ఈ సమావేశానికి వెళ్లకూడదని చంద్రబాబు వారించినా కూడ సుమారు 14 మంది నేతలు మీటింగ్లో పాల్గొన్నారు.కాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులు రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చొరవతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన కాపు నాయకులు 13 నుంచి 15 మంది దాకా హాజరయ్యారు. భేటీ రహస్యంగానే మొదలైనా... కాసేపటికే కాపు నాయకులు సమావేశమయ్యారన్న వార్త గుప్పుమంది. బీజేపీలో చేరే వ్యూహంలో భాగంగా వీరంతా భేటీ అయ్యారని జోరుగానే ప్రచారం జరిగింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications