దుర్గ గుడి వెండిరథాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు .. మంత్రి వెల్లంపల్లి బర్తరఫ్ కు దేవినేని డిమాండ్
ఏపీలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై సిబిఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు . విజయవాడ దుర్గ గుడి వెండి రథంలో మూడు సింహాలు మాయమైన ఘటనపై టిడిపి నేతలు భగ్గుమన్నారు. దుర్గ గుడిని సందర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రభుత్వ అసమర్థతపై మండిపడ్డారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
దుర్గ గుడి ఈవో సురేష్ బాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటూ మండిపడిన టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు దేవినేని ఉమ. ఏపీలోని ఆలయాలపై జరుగుతున్న దాడులపై జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలి అంటూ డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను ప్రభుత్వం కాపాడాలంటూ దేవినేని ఉమా పేర్కొన్నారు.

విజయవాడ కనకదుర్గా ఆలయంలో దుర్గమ్మ రథానికి ఉండే మూడు వెండి సింహాలు అదృశ్యం అయిన ఘటనకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యుడు అంటూ దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు.
Recommended Video
ఆలయాలు ,చర్చిలు, మసీదుల పై దాడులు ఖండిస్తున్నామని దేవినేని ఉమా పేర్కొన్నారు .టిడిపి నేతలతో కలిసి దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన దేవినేని ఉమా వెండి రధాన్ని పరిశీలించారు. ఈ ఘటన దుర్మార్గమని, తప్పును కప్పి పుచ్చి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు . నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ ఈవో సురేష్ బాబును వెంటనే సస్పెండ్ చేయాలని ,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను బర్తరఫ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications