పోలీసులమని బెదిరించి మహిళపై గ్యాంగ్ రేప్

విశాఖ నగర పరిధిలోని పెందుర్తి సమీపంలో నివస్తున్న మహిళ (35) ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో తాను పనిచేస్తున్న దుకాణం నుంచి రిక్షా నాయుడు అనే తెలిసిన వ్యక్తిని తోడు తీసుకుని ఇంటికి బయలుదేరింది.
దారిలో మహేష్, వరప్రసాద్, రమేష్, రమణ అనే యువకులు వారిని అడ్డగించి, తాము పోలీసులమంటూ బెదిరించి ఆ మహిళపై అత్యాచారం చేశారు. మూడు రోజుల తరువాత కోలుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమెను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు, కేసు విచారించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు సాగుతోంది.












Click it and Unblock the Notifications