విశాల సాహితి కథా వర్క్షాప్
విశాల సాహితీ సంస్థ కథా వర్క్షాప్ ఆగస్టు 26 - 29 తేదీల మధ్య నాలుగు రోజులు పాటు హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగుతుందని సంస్థ ఆహ్వాన సంఘం ప్రతినిధులు గూడూరి సీతారాం, నిజాం వెంకటేశం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కథల పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విజేతలకు వార్క్షాప్ సందర్భంగా అవార్డులు అందజేస్తారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన చేశారు.
ఇదే సందర్భంలో విశాల సాహితీ బి.యస్. రాములు కథా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని వారు చెప్పారు. దాశరథి రంగాచార్య, ఆచార్య కొలుకులూరి ఇనాక్ వంటి సాహితీవేత్తలు ఈ అవార్డులు పొందినవారిలో వున్నారని వారన్నారు. కథా వర్క్షాప్ నిర్వహణలో భాగంగా వివిధ రచయితలు రాసిన పలు పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు ఔత్సాహిక రచయితలను, సాహిత్యకారులను, సామాజిక శాస్త్రవేత్తలను కోరారు.