'మరణానంతర జీవితం' పై కొన్ని మాటలు

సమాజాన్ని నియంత్రించే యంత్రాంగాల గుట్టు మట్లు తెలిసిన నందిగం కృష్ణారావు, సమాజం ముందు వాటి నేరాలను చెప్పే 'సాక్షి'గా కనిపిస్తారు. కేసుల్లో నిర్భయంగా సాక్ష్యం చెప్పగల చేవను కలిగి ఉండడమే పెద్ద సాహసం. కృష్ణారావు రచయితగా ఆ పని చేస్తున్నారు.
కథలే కాకుండా, ఇంతకు ముందు రాసిన 'చీకట్లో నల్లపిల్లి' నవల, ఇప్పటి 'మరణం తర్వాత..' నవల విశాలమైన కాన్వాసును మన ముందు నిలుపుతాయి. అలవోకగా, అప్రయత్నంగా ప్రారంభమైనట్లు కనిపించి, ఓ మంత్ర నగరి మాయాజాలంతో మొదలు పెట్టి ఆయన సమాజం ఇరుకు సందుల్లోకే కాకుండా మనుషుల ఇరుకు మనస్సులోకి నడిపించుకుని పోతారు. ఆయన దారి చూపుతుంటే పాఠకులు ఎప్పుడేమవుతుందో, అలా జరగకపోతే బాగుండేమో అనిపిస్తూ వుంటుంది. కానీ, సత్యం అదే. సత్యాన్ని తప్పించుకుని పోవడం మన వల్ల కాదు.
'మరణానంతర జీవితం' చదువుతుంటే, మనకు తెలియని బీభత్స మనోవల్మీకాలు మనల్ని వెంటాడి, మన నీడ మనల్నే మోసం చేసే వైనాన్ని కళాత్మకంగా చెబుతుంది. పరిస్థితులకు మనుషులు ఎలా దాసోహమవుతారో, ఆ దాసోహం చేయడానికి మనల్ని నడిపిస్తున్న శక్తులేమిలో ఈ నవల చదివితే కచ్చితంగా తెలిసిపోతుంది. విలువలను, శక్తులను తిరగేయాల్సిన అవసరాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది.
- కాసుల ప్రతాపరెడ్డి
(నందిగం కృష్ణారావు 'మరణం తర్వాత..' నవలకు రాసిన ముందుమాట)
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications