ఎన్టీఆర్ బాటలో చిరు!

రాజకీయాల్లో ఫ్లాప్ అయిన ఆయన మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతారన్న వదంతులు నిజం కావు. అయితే ఐదేళ్ళ పాటు చిరంజీవి పార్టీకి ఫుల్ టైమ్ సేవలు అందించగలరా? పార్టీపై అంకితభావంతో ముందుకు వెళ్ళాలని ఆయన అనుకుంటున్నారు. కానీ ఇంతకాలం అల్లు అరవింద్ కనుసైగల్లో ఉన్న చిరంజీవి ఇప్పుడు సొంతంగా వ్యవహరించడం కష్టమే. పార్టీ టికెట్లను అమ్ముకున్నారన్న ఆరోపణలను చిరంజీవి సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారు. దీనిపై విచారణకు కూడా ఆయన సిద్ధం కాలేదు.
రైలింజన్ గుర్తు సరిగ్గాలేకపోయినా, పార్టీ సంస్ధాగతంగా బలపడకపోయినా 17 శాతం ఓట్లు రాబడం విశేషమని చెబుతున్నారు. అందుకే ఐదేళ్ళ తర్వాత అయినా తానే ముఖ్యమంత్రినన్న నమ్మకంతో ఎక్కువ సమయాన్ని పార్టీకి కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాము అధికారంలోకి రాబోవడం లేదని పక్కా సమాచారం చిరంజీవికి ఎన్నికలు ముగిసినప్పడే ఉంది. అయితే ఆయన హంగ్ అసెంబ్లీ వస్తుందన్న ఆశల్లో ఉండేవారు. మధ్యంతర ఎన్నికలు వస్తే ప్రజారాజ్యంని అధికారంలోకి తీసుకురాగలనన్న నమ్మకం ఆయనకు ఉండేది. కానీ కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోవడం, వైఎస్ ఇమేజ్ బాగా పెరగడం ప్రజారాజ్యం మనుగడకు అడ్డంకి కలిగించే విషయాలే. టికెట్ కొనుక్కుని రైలు ఎక్కిన తర్వాత మధ్యలో ఎలా దిగిపోలేమో చిరంజీవి పరిస్ధితి కూడా అంతే ఉంది. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగక తప్పని పరిస్ధితి ఏర్పడింది.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు












Click it and Unblock the Notifications