ఎన్టీఆర్ బాటలో చిరు!

రాజకీయాల్లో ఫ్లాప్ అయిన ఆయన మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతారన్న వదంతులు నిజం కావు. అయితే ఐదేళ్ళ పాటు చిరంజీవి పార్టీకి ఫుల్ టైమ్ సేవలు అందించగలరా? పార్టీపై అంకితభావంతో ముందుకు వెళ్ళాలని ఆయన అనుకుంటున్నారు. కానీ ఇంతకాలం అల్లు అరవింద్ కనుసైగల్లో ఉన్న చిరంజీవి ఇప్పుడు సొంతంగా వ్యవహరించడం కష్టమే. పార్టీ టికెట్లను అమ్ముకున్నారన్న ఆరోపణలను చిరంజీవి సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారు. దీనిపై విచారణకు కూడా ఆయన సిద్ధం కాలేదు.
రైలింజన్ గుర్తు సరిగ్గాలేకపోయినా, పార్టీ సంస్ధాగతంగా బలపడకపోయినా 17 శాతం ఓట్లు రాబడం విశేషమని చెబుతున్నారు. అందుకే ఐదేళ్ళ తర్వాత అయినా తానే ముఖ్యమంత్రినన్న నమ్మకంతో ఎక్కువ సమయాన్ని పార్టీకి కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాము అధికారంలోకి రాబోవడం లేదని పక్కా సమాచారం చిరంజీవికి ఎన్నికలు ముగిసినప్పడే ఉంది. అయితే ఆయన హంగ్ అసెంబ్లీ వస్తుందన్న ఆశల్లో ఉండేవారు. మధ్యంతర ఎన్నికలు వస్తే ప్రజారాజ్యంని అధికారంలోకి తీసుకురాగలనన్న నమ్మకం ఆయనకు ఉండేది. కానీ కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోవడం, వైఎస్ ఇమేజ్ బాగా పెరగడం ప్రజారాజ్యం మనుగడకు అడ్డంకి కలిగించే విషయాలే. టికెట్ కొనుక్కుని రైలు ఎక్కిన తర్వాత మధ్యలో ఎలా దిగిపోలేమో చిరంజీవి పరిస్ధితి కూడా అంతే ఉంది. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగక తప్పని పరిస్ధితి ఏర్పడింది.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications