విభజనపై చంద్రబాబు తటస్థుడా?

రాష్ట్ర అవతరణ దీనోత్సవ ప్రసంగంలో చంద్రబాబు తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని, సమైక్యాంధ్ర అనుకూల వైఖరిని బయట పెట్టుకున్నారు. పార్టీ వైఖరిని ప్రతిబింబించాల్సిన పార్టీ అధ్యక్షుడు అందుకు భిన్నంగా మాట్లాడడం, వ్యవహరించడం ఇదే తొలిసారి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం బూర్గుల రామకృష్ణారావు పదవీ త్యాగం చేశారని ఆయన చెప్పారు. తెలుగుజాతి మూడు వేల సంవత్సరాలుగా కలిసి ఉందని, కేవలం 150 సంవత్సరాలు మాత్రమే విడిపోయి ఉందని చెప్పారు. తద్వారా ఆయన తన రాష్ట్ర విభజన వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకున్నారు. ఇది తటస్థ వైఖరి ఎంత మాత్రమూ కాదని అంటున్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు, చంద్రబాబు నాయుడి బావమరిది నందమూరి బాలకృష్ణ కూడా సమైక్యాంధ్ర రాగం వినిపించారు. రాష్ట్రావతరణ రోజు ఆయన ఓ కార్యక్రమంలో రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకున్నారు. చంద్రబాబు తెలంగాణ అనుకూల వైఖరి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో బాలకృష్ణ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరిస్తే పార్టీ చీలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని అంటున్నారు. ఎన్టీ రామారావు మరో కుమారుడు నందమూరి హరికృష్ణతో పాటు బాలకృష్ణలతో పాటు సీమాంధ్ర నాయకులు చంద్రబాబు తల మీదికి కుంపటిని తెచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications