గోల్కొండ కోటలా ఏపీలో కొండపల్లి కోట: చంద్రబాబు ప్లాన్
అమరావతి: తెలంగాణలోని హైదరాబాద్లో గల గోల్కోండ కోట తరహాలో విజయవాడ సమీపంలోని కొండపల్లి కోటను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా కొండపల్లి కోట వైభవాన్ని తెలియచెప్పి, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందించాలని టూరిజం విభాగానికి ఆదేశాలు అందాయని తెలుస్తోంది.
కొండపల్లి కోటను రెడ్డి రాజుల కాలంలో నిర్మించారు. అయితే పాలకుల ఆదరణకు నోచుకోక మరుగున పడింది. ఏపీ విడిపోయిన అనంతరం రాజధానికి అమరావతి సమీపంలోనే ఈ కోట ఉంది. ఈ కోట చరిత్రను అందరికీ పరిచయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

ఈ కోటను అబివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు ప్రస్తుతం హైదరాబాదులోని స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని ఏపీకి తీసుకురావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అభివృద్ధి పనుల్లో భాగంగా కొండపల్లి గ్రామం నుంచి కోట వరకూ రోప్ వే, ఫుడ్ కోర్టులు తదితరాలు నిర్మించనున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన మెగా టూరిజం సర్క్యూట్లో కొండపల్లికి స్థానం లభించింది.కొండపల్లి - ఇబ్రహీంపట్నం - భవానీ ద్వీపం - మచిలీపట్నం - దివిసీమ ప్రాంతాలను భాగం చేస్తూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications