విశాఖ తీరంలో విషపు చేప: తింటే ప్రాణాలకే ముప్పు.. ప్రపంచంలో ఇలాంటివి నాలుగే?
ఆంధ్ర విశ్వ విద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్(ఎంఎల్ఆర్) విభాగం ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
విశాఖపట్నం: ప్రపంచం మొత్తం మీద ఉన్న నాలుగు అత్యంత విషపూరిత చేప జాతుల్లో ఒక రకం విశాఖ తీరంలో లభ్యమైంది. షార్ప్ టైల్ చేపగా పిలిచే ఈ జాతి చేపల్ని తింటే ప్రాణాలు పోవడం ఖాయమంటున్నారు.
ఈ చేపల్లో ఉండే సఫర్ పాయిజన్ అనే విషపూరిత గ్రంధుల వల్ల వీటిని తిన్న వెంటనే వాంతులు, పక్షవాతానికి గురై మరణిస్తారని చెబుతుననారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్(ఎంఎల్ఆర్) విభాగం ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధన:
విశ్వవిద్యాలయ పూర్వ అధిపతి ప్రొఫెసర్ దేవర వేణు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిషింగ్ టెక్నాలజీ(సీఐఎఫ్.టి)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ ఎన్ఎం కృష్ణ, నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి.గోవిందరావు సముద్ర జాతులపై, మత్స్య సంపదపై జరుపుతున్న పరిశోధనల్లో భాగంగా ఈ షార్ప్ టైల్ గురించి వెలుగులోకి వచ్చింది.
Recommended Video


కప్ప చేప.. షార్ప్ టైల్ మోలా:
స్థానికులు దీన్ని కప్ప చేపగా పిలుస్తారని పరిశోధకులు చెబుతున్నారు. దీని ముక్కు చిలక ముక్కును పోలి ఉంటుందని, నోరు డైమండ్ ఆకారంలో ఉంటుందని, రెండు పళ్లు ఉంటాయని, ప్రపంచం మొత్తం మీద ఇలాంటి రకాల చేపలు 4రకాలే ఉంటాయని అంటున్నారు.

తూర్పు తీరంలో ఒక్క విశాఖలోనే:
ఈ షార్ప్ టైల్ మోలా చేపకు దగ్గరి పోలికలున్న మరో రకం చేపను పశ్చిమ తీరంలో గుర్తించినట్లు తెలిపారు. దీనిలా దానికి తోక మాత్రం ఉండదన్నారు. సైన్స్ పరిభాషలో దీన్ని మోలామోలాగా పిలుస్తారని చెప్పారు. దేశంలోని తూర్పు తీరంలోకెల్లా ఒక్క విశాఖ తీరంలోనే షార్ప్ టైల్ మోలా రకం చేపలు ఉన్నట్లు తెలిపారు. దీనిని సన్ ఫిష్, పఫర్ ఫిష్ గాను పిలుస్తారని చెప్పారు.

విషపూరితం:
అర్థచంద్రాకారంలో సుమారు 40-45కిలోల బరువుతో, 1.4మీటర్ల పొడువుతో ఈ చేపలు ఉంటాయన్నారు.
ఈ చేపలు తినడం విషపూరితమని స్థానిక మత్స్యకారులకు తెలుసునని, అయితే దీనిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications