చంద్రబాబూ! జవాబు చెప్పవేం: ఏకిపారేసిన శిల్పా కూతురు, కోడలు
శిల్పా సహకార సొసైటీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కూతురు శిల్పా, కోడలు నాగిని రెడ్డిలు ధీటుగా స్పందించారు. వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు.
నంద్యాల: శిల్పా సహకార సొసైటీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కూతురు శిల్పా, కోడలు నాగిని రెడ్డిలు ధీటుగా స్పందించారు. వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబూ! దీనికి జవాబు చెప్పవేం
2014లో వైసిపి నుంచి గెలిచిన 21 మంది ఆ తర్వాత టిడిపిలో చేరారని, అందులో నలుగురు మంత్రులు అయ్యారని, వారికి టిడిపిలో కొనసాగే నైతిక హక్కు ఎక్కడిదని, దీని గురించి అడిగితే చంద్రబాబు జవాబు చెప్పరని శిల్పా మోహన్ రెడ్డి కూతురు శిల్పా నిలదీశారు. పైగా తమపై నిందలు వేస్తారన్నారు.
Recommended Video


మంత్రులు, టిడిపి నేతలు ఇక్కడ కనిపించరు
తన తండ్రి నంద్యాలకు ఉచిత మినరల్ వాటర్ ఇస్తున్నారని కూతురు శిల్పా అన్నారు. చంద్రబాబు, టిడిపి నేతల బెదిరింపులకు నంద్యాల ప్రజలు భయపడవద్దని ఆమె ధైర్యం చెప్పారు. రెండు రోజుల తర్వాత మంత్రులు, టిడిపి నేతలు ఇక్కడ కనిపించరని ఎద్దేవా చేశారు.

మా నాన్న మంచివాడు
తన తండ్రి శిల్పా మోహన్ రెడ్డి అనుభవం కలిగిన నేత అని, మంచివాడు అని కూతురు శిల్పా అన్నారు. ఆయనకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి నేతలు ఓట్ల కోసం తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. నంద్యాల ప్రజల వెంట తమ కుటుంబం ఉంటుందన్నారు.

ఓటమి భయంతోనే.. శిల్పా నాగిని రెడ్డి
శిల్పా సహకార సొసైటీని మహిళల కోసం నడిపిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్, శిల్పా కోడలు శిల్పా నాగిని రెడ్డి అన్నారు. దీని వల్ల మహిళలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. శిల్పా మంచి వ్యక్తి అని గతంలో చంద్రబాబే చెప్పారన్నారు. ఇప్పుడు ఓటమి భయంతో మాట్లాడుతున్నారన్నారు. ఓటమి భయంతో చిన్న విషయాలను తప్పులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications