భాషోద్యమ నేత ధర్మారావు మృతి

సి ధర్మారావుగా అందరికీ సుపరిచితులైన ఆయన హైదరాబాదులోని చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. ఆయన కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లిలో 1934 మార్చి 30వ తేదీన జన్మించారు. ఆయన రవ్వలుపువ్వులు, ప్రేమించుకుందాం రండి పుస్తకాలు తెచ్చారు. గోరాశాస్త్రి, ఇస్మాయిల్, ఎఆర్ కృష్ణ షష్టిపూర్తి ఉత్సవాల సంచికలు, మనస్వి చలం శత జయంతి సంఘం ప్రత్యేక సంచికను ప్రచురించారు. జనహిత సంస్థ తరఫున ఆయన 1990లో 103 మంచి తెలుగు పుస్తకాల జాబితాను రూపొందించారు.
ప్రముఖ రచయిత్రి కమలాదాస్ మై స్టోరీని దేవీప్రియ సంపాదకత్వం వహించిన తెలుగు ప్రజాతంత్రలో ధారావాహికగా వెలువరించారు. ధర్మారావు రాష్ట్ర సచివాలయంలో పనిచేశారు. అధికార భాషా సంఘం కార్యదర్శిగా పనిచేశారు. గన్నవరం హైస్కూలు, ఏలూరు కాలేజీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. కాలమిస్టుగా, వ్యాసకర్తగా తెలుగు పత్రికా ప్రపంచంలో ఆయన చిరపరిచితులు. ఆయన భౌతికకాయానికి బుధవారం అంబర్పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుమారులు సి శ్రీనివాసరావు, సి. రామోహన్ రావు చెప్పారు.
ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆయన మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ సి. ధర్మారావు భౌతిక కాయాన్ని సందర్శించి, సంతాపం ప్రకటించారు. ప్రముఖ కవి యాకూబ్ సి. ధర్మారావు మృతికి సంతాపం ప్రకటించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications