కేజ్రీవాల్ విజయం ఎందుకంత సంచలనం?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది కేవలం బిజెపి, కాంగ్రెసు పార్టీలను తుడిచిపెట్టడమే ఆ సంచలనానికి కారణమా, ఇంకేమైనా ఉందా అనేది పరిశీలించాల్సి ఉంది. ఒక్క రాష్ట్రంలో బిజెపి ఓడిపోవడం అనేది పెద్ద విషయం కాదు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఆ మేరకే చూడడం లేదు. ఆ పార్టీ విజయం వెనక ఓ సామూహిక మానసిక పరిస్థితి ఒక్కటి పనిచేసింది. దేశంలో అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ హవాను అది బద్దలు కొట్టింది. కాంగ్రెసు, బిజెపి వ్యతిరేక పార్టీలకు కేజ్రీవాల్ విజయం ఓ ఊరటను, ఆనందాన్ని కలిగించాయి. బిజెపిని ఓడించగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి.
మోడీని, ఆయన నాయకత్వంలోని ఓడించడం సాధ్యం కాదని అనుకుంటున్న సమయంలో కేజ్రీవాల్ అది సాధ్యమేనని నిరూపించారు. మోడీని ఓడించడం సాధ్యం కాదనేది తేలిపోయిందని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాటలు ఆ విషయాన్నే పట్టిస్తున్నాయి. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా బిజెపిని నిలువరించడం సాధ్యం కాదని, తాను బలంగా లేని ఎనిమిది రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అమిత్ షా పనిచేస్తున్నారని, ఇక దేశంలో బిజెపి తిరుగులేని శక్తిగా మారుతుందని, ఏకపార్టీ ఆధిపత్యం ఉనికిలో వస్తుందని అనుకుంటూ వస్తున్నారు. కానీ, అది అంత సులభం కాదని కేజ్రీవాల్ నిరూపించారు.

కాంగ్రెసు పార్టీ తిరిగి జవజీవాలు పొందడం కష్టమనే భావన కూడా ఇప్పటి వరకూ ఊంటూ వచ్చింది. అది కొంత మేరకు నిజం కూడా. కాంగ్రెసు పరిస్థితి వల్ల బిజెపికి ప్రత్యామ్నాయం లేదనే భావన బలంగా నాటుకుపోయి ఉంది. కేజ్రీవాల్ విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరించే అవకాశాలు ఉండడంతో పాటు, అవసరమైతే ఆ పార్టీతో కలిసి బిజెపిని ఎదుర్కోగలమని బిజెపి వ్యతిరేక పార్టీలు భావిస్తూ ఉండవచ్చు. వామపక్షాలకు మాత్రం అదే ఆశ ఉంది.
మధ్యతరగతి ప్రజలను, యువతను ఆమ్ ఆద్మీ పార్టీ తనవైపు తీప్పుకోవడం బిజెపికి పెద్ద దెబ్బ. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రదర్శించిన శక్తి, తాజాదనం, వినూత్నమైన ప్రచార సరళి అనుసరిస్తే బిజెపిని ఎదుర్కోవచ్చుననే విశ్వాసాన్ని బిజెపియేతర పార్టీలకు కలిగించింది. సమకాలీన సమస్యలను, ప్రజాదరణను ఆసరా చేసుకుని ముందుకు సాగితే విజయం వరిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించింది.దానికి తోడు, ఆమ్ ఆద్మీ పార్టీ విజయం లౌకిక శక్తులు ఏకం కావడానికి దోహదం కూడా చేస్తుంది.
ఒక రకంగా, దేశంలోని బిజెపి వ్యతిరేక పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ దారి చూపింది. కాంగ్రెసు రోజురోజుకీ కుదించుకుపోయే పరిస్థితి ఏర్పడిన తరుణంలో బిజెపిని ఎదుర్కునే శక్తులు బలహీన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం బిజెపి వ్యతిరేక పార్టీలకు ఆత్మవిశ్వాసాన్ని ఢిల్లీ ఫలితాలు కలిగించాయి.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications