వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ నేతగా ఉండరు: వెంకయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
న్యూఢిల్లీ: వచ్చే లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ ఎల్ కె అద్వానీ నాయకత్వంలో పోటీ చేయబోదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. 2014 ఎన్నికల నాటికి కొత్త నాయకత్వం రావడం న్యాయంగా ఉంటుందని ఆయన గురువారం అన్నారు. వచ్చే ఎన్నికల్లో అద్వానీ పోటీ చేయబోరని, వచ్చే ఎన్నికల్లో తాము అద్వానీ నాయకత్వంలో ఎన్నికలకు దిగబోవడం లేదని ఆయన ఒక న్యూస్ చానెల్ తో అన్నారు. వచ్చే ఎన్నికల్లో అద్వానీ పోటీ చేస్తారా అని అడిగితే 2014 నాటిిక అద్వానీకి 87 ఏళ్లు వస్తాయని ఆయన జవాబిచ్చారు.

ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే కొత్త నాయకుడు వస్తాడని ఆయన చెప్పారు. అప్పటికి ఎవరు నాయకత్వం వహిస్తారని అడిగితే రాజకీయ పార్టీలు సమస్యల గురించి చర్చిస్తాయని, ఒక అభిప్రాయానికి వచ్చి అవసరాన్ని బట్టి ఏకాభిప్రాయ సాధన ద్వారా నాయకుడు వస్తాడని ఆయన సమాధానమిచ్చారు. అద్వానీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నామని, ఎప్పుడు దిగిపోవాలనే విషయంపై అద్వానీ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.

కొత్త నేతకు ఎప్పుడు అవకాశమిస్తారనేది అద్వానీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉందని, అందుకు అద్వానీకి గడువు ఏదీ పెట్టలేదని ఆయన చెప్పారు. రెండో సారి వరసగా ఓటమి పాలైనప్పుడు సహజంగా కొంత నైతిక స్థయిర్యం దెబ్బ తింటుందని, ఆ సమయంలో మార్గదర్శకత్వం వహించాలని కోరామని, సాధారణ ప్రక్రియలోనే నాయకత్వ మార్పిడి జరుగుతుందని, కొత్త నేతను ఎన్నుకునేది ఎప్పుడనేది అద్వానీ ప్రకటిస్తారని ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X