ప్రజాప్రతినిధులకు పోలీసుల లక్ష్మణరేఖలు
ఇవే కాకుండా తూర్పు సరిహద్దులోని విశాఖ గ్రామాలు గూడెం కొత్తవీధి, కొయ్యూరు అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఓ ప్రైవేటు వాహనంపై దాడి చేసిన నేపథ్యంలో పోలీసు నిఘాను కట్టుదిట్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటు న్న గిరిజన ప్రజాప్రతినిధులందరికీ తగిన మార్గదర్శకాలు జారీచేశామని రంపచోడవరం ఏఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ తెలిపారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు తమ వద్ద సమర్ధమంతమైన బలగాలు సిద్ధంగా ఉన్నాయ న్నారు. పోలీసుల సూచనల మేరకు రంపచోడవరం ఎమ్మెల్యే కె.కె.వి.వి.వి. సత్యనారాయణరెడ్డి తన పలు పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈనెల 14న జరగాల్సిన ఐటీడీఏ పాలకమండలి సమావేశాన్ని వాయిదా వేశారు. సోమవారం రాత్రి నుంచీ రాజవొమ్మంగి, జెడ్డంగి పోలీస్ స్టేషన్ల ఎదుట ద్విచక్ర వాహనాలతో సహా, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా వైపు నుంచి వస్తున్న వాహనాలు, వాహనదారుల వివరాలను సీఐ ఆర్.రామచంద్రరావు ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు.