విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు బెంచ్ తెచ్చుకుంటే విభజనే: లగడపాటి రాజగోపాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని, అయితే దానికి డిసెంబర్ 31 వరకు లాయర్లు ఆగాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సీమాంధ్ర లాయర్లకు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో సూచించారు. డిసెంబర్ 31 తర్వాత హైకోర్టు బెంచ్ ఇవ్వకుంటే తనతో పాటు న్యాయశాఖామంత్రి ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారు.

అయితే లాయర్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా డిసెంబర్ 31 వరకు ఆగాలని చెప్పారు. అంతవరకు కోర్టులకు తాళాలు వేయటం, జిల్లా బంద్ లు నిర్వహించటం మానుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఇప్పుడే బెంచ్ ఇస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని ఆయన చెప్పారు. కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న వాళ్లు మొదట ఆయన విగ్రహాన్ని ఏర్పరిచి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పారు. అయితే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అలాంటి యోధుల విగ్రహాలు రాష్ట్రమంతటా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆయన విగ్రహాల్ని ఏర్పాటు చేయటానికి సుముఖంగానే ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X