భాను కిరణ్ కోసం పోలీసుల విస్తృత వేట, అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి విచారణ

సీసీఎస్ అధికారులు భానుకిరణ్ తల్లి, సోదరి, బావలను మంగళవారం పిలిపించారు. వారిని మూడు గంటలసేపు విచారించారు. కొన్ని అంతర్గత విషయాలను వాకబు చేసినట్టు తెలిసింది. బయటకు వచ్చిన అనంతరం భానుకిరణ్ బావ బ్రహ్మానందం మాట్లాడారు. పోలీస్ అధికారులు అడిగిన వివరాలను చెప్పామని, మరోమారు పిలిచినా వస్తామని అన్నారు. తమకూ, భానుకు సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, తమకు ఎలాంటి ఆస్తులు, నగదు ఇవ్వలేదని అతడి తల్లి స్పష్టం చేసినట్టు తెలిసింది. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు అవసరమైనంత వ్యవధి ఇవ్వాలని కోరారు. భానును పోలీసులు ఏం చేసినా తమకు అభ్యంతరం లేదంటూ ఒకదశలో వ్యాఖ్యానించినట్టు సమాచారం.
భానుకిరణ్తో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు మంచిరేవులలో భూమి కొనుగోలులో భాగస్వామిగా ఉన్న అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డిని సీసీఎస్ పోలీసులు మంగళవారం ప్రశ్నించారు. భూమి కొనుగోలు, భానుతో ఏ మేరకు పరిచయం, సూరితో సంబంధాలున్నాయా వంటి అంశాలపై సుమారు నాలుగు గంటలపాటు ప్రశ్నించినట్టు తెలిసింది. విచారణలో భాగంగా భానుతో సంబంధం ఉన్నవారినందరినీ ప్రశ్నిస్తున్నామని, ఇందులో భాగంగానే అతడి కుటుంబ సభ్యులను, అబ్బిరెడ్డిని పిలిపించామని సీసీఎస్ డీసీపీ సత్యనారాయణ వివరించారు
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications