Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిజమైన కాంగ్రెసు కార్యకర్తల్ని గుర్తించాల్సిన సమయం: కిరణ్

Kiran Kumar Reddy
హైదరాబాద్: పార్టీలో నిజమైన కాంగ్రెసు వాదులు ఎవరో కానివారెవరో గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంగళవారం పిసిసి మానిటరింగ్ కమిటీ భేటీలో అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించేందుకు ఇటీవలే ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు అందరూ సర్వసన్నద్ధం కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరతకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రభుత్వం 2014 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని సమావేశంలో సూచించారు. మీడియా కూడా పథకాలకు ప్రధాన్యత ఇస్తే తప్పులేదన్నారు. ప్రజల కోసం చేసే పనులే కాబట్టి మీడియా కూడా కవరేజ్ చేయవచ్చన్నారు. రచ్చబండ కార్యక్రమంలో రెండు కోట్ల మంది పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ఈ భేటీలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+