ముఖ్యమంత్రి కరుణానిధి కలైంజ్ఞర్ టీవీ చానెల్పై సిబిఐ దాడులు
ఈ సోదాల సమయంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, ఛానల్కు చెందిన ఉన్నతాధికారులను తమ అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు గంటల తరబడి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ కుంభకోణం కేసులో అరెస్టు చేసిన ఏ.రాజాను తీహార్ జైలుకు పంపించారు. అంతేకాకుండా, డీఎంకే చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి కుమార్తె, రాజ్యసభ ఎంపీ కనిమొళికి కూడా ఈ కుంభకోణంతో సంబంధంతో ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆమె నడుపుతున్న ఒక స్వచ్చంధ సంస్థకు స్పెక్ట్రమ్ నిధులు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెను కూడా సీబీఐ విచారించ వచ్చనే ప్రచారం జరుగుతోంది.
Comments
English summary
The CBI today carried out searches in the offices and residences of top management of DMK first family run Kalaignar
TV in connection with the 2G spectrum scam. The raids came days after the channel claimed it had no links with the
case.
Story first published: Friday, February 18, 2011, 12:40 [IST]