స్వల్పంగా క్షీణించిన వైయస్ జగన్ ఆరోగ్యం, నాలుగో రోజుకు దీక్ష

ఫీజు రీఎంబర్స్మెంట్పై ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పరకాల ఎమ్యెల్యే కొండా సురేఖ హెచ్చరించారు. జగన్కు ఏమైనా హాని జరిగితే అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సివుంటుందన్నారు.ఫీజు రీఎంబర్స్మెంట్ వ్యవహారాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఫిబ్రవరి 24 తేదీయే తుది గడువని ఆమె అన్నారు. దీక్షపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యువత తిరుగబడుతుందన్నారు. అసెంబ్లీకి 2 కిలోమీటర్ల దూరంలో పారా మిలిటరీ దళాలను నియమించడం ఎందుకన్నారు. ఇందిరాపార్క్ వద్ద యువనేత జగన్ చేపట్టిన దీక్ష శిబిరం వద్ద ఆమె ప్రసంగించారు.












Click it and Unblock the Notifications