వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాప్ట్‌వేర్ ఉద్యోగుల భద్రతకు భారత ఐటి కంపెనీల చర్యలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Infosys
న్యూఢిల్లీ: జపాన్‌కు అణు రేడియేషన్ ముప్పు పొంచివున్న నేపధ్యంలో అక్కడ పనిచేస్తున్న తమ ఉద్యోగుల భ ద్రత కోసం భారత ఐటి దిగ్గజాలైన టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ చర్యలు చేపట్టాయ. జపాన్‌లోని తమ సిబ్బంది స్వదేశానికి రప్పించేందుకు, అలాగే తమ జపాన్ ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసేందుకు ఈ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయ.

మా ఉద్యోగుల భ ద్రత మాకు ముఖ్యం. జపాన్‌లో పనిచేసే భారత సిబ్బంది.. వారి కుటుంబాలు స్వదేశానికి రావాలనుకుంటే వారికి ఏర్పాట్లు చేస్తాం, అలాగే స్థానిక జపనీస్ ఉద్యోగులు, వారి కుటుంబాలను వేరే సురక్షిత ప్రాంతాలకు పంపిస్తామని టిసిఎస్ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. జపాన్‌లో మా సిబ్బంది క్షేమంగా ఉన్నారు. అయనప్పటికీ వారు కోరితే స్వదేశానికి రప్పించి ఇక్కడ అదే స్థాయలో ఉద్యోగాలు కల్పిస్తామని విప్రో సీనియర్ ఉపాధ్యక్షుడు (హెచ్‌ఆర్) సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.

జపాన్‌లో ప్రస్తుత విపత్తు నేపధ్యంలో అక్కడ పనిచేసే మా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎవరైనా తాత్కాలికంగా భారత్ రావాలని కోరితే అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్ఫోసిస్ ప్రతినిధి తెలియజేశారు.

English summary
Though the earthquake with a magnitude of 8.9 that hit northeastern Japan on Friday, generating a tsunami as high as 10 meters, may not affect India directly, in all possibility it is a worrying development for Indian enterprises who have operations in Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X