హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన ఎమ్ఆర్‌పిఎస్ నేత మందకృష్ణ మాదిగ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్ఆర్‌పిఎస్) నేత మందకృష్ణ మాదిగ దుమ్మెత్తిపోశారు. తెలంగాణ ప్రజలను కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ కాంగ్రెసుకు అమ్ముడుపోయారు, అమ్ముడుపోతున్నారని రుజువైందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు తెరాస శాసనసభ్యులు కాంగ్రెసుకు ఓటు చేయడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.

కెసిఆర్ 11 మంది సభ్యులను కాపాడుకోలేకపోతున్నారని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎలా నెరవేరుస్తారని ఆయన అన్నారు. తెరాస సభ్యులు కాంగ్రెసుకు ఓటు వేయడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మే నెల వరకు వాయిదా వేయడం ద్వారా తెలంగాణకు కెసిఆర్ ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులను నమ్ముకుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే స్థితి లేదని, తెలంగాణకు కెసిఆరే ఆడ్డంకి అని ఆయన అన్నారు.

English summary
MRPS leader Manda Jrishna Madiga lashed out at TRS president KCR for his MLAs resorting to cross voting in MLC election. He said that KCR is main hurdle for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X