వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యసాయి ట్రస్టు సభ్యులు డబ్బులు తరలిస్తున్నారు?: పుట్టపర్తిలో హడావుడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
అనంతపురం: శనివారం రాత్రి పోలీసులకు పట్టుబడ్డ 35.5 లక్షల రూపాయల సొమ్ము సత్యసాయి ట్రస్టుకు చెందినదిగానే పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో కొడికొండ చెక్ పోస్టు దగ్గర ఓ వాహనం నుండి ఆ డబ్బులు పట్టుకున్నారు. అయితే ఇది సత్యసాయి ట్రస్టుదే అని అనుమానిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో ఒకరైన హరీష్ నందా శెట్టి ట్రస్టులోని ఓ ముఖ్యమైన సభ్యుడి డ్రైవర్ అని తెలుస్తోంది. నిందితులు కూడా ఆ డబ్బు ట్రస్టుదే అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ట్రస్టు సభ్యుల్లోని ఒకరు తమని పంపినట్లు వారు చెప్పారంట. బెంగుళూరులోని ఓ వ్యక్తికి ఇవ్వమని చెప్పి ఫోన్ నంబర్ కూడా ఇచ్చారంట.

దీంతో ట్రస్టు సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. ట్రస్టు సభ్యులు నలుగురు ఆదివారం అకస్మాత్తుగా యజుర్ మందిరంలోకి వెళ్లారు. దీంతో అందరిలో మరింత అనుమానం బలపడిపోతోంది. యజుర్ మందిరంలోని డబ్బును గురు, శుక్రవారాల్లో లెక్కించిన విషయం తెలిసిందే. అయితే డబ్బును అంతా లెక్కించకుండా కొంత మాత్రమే లెక్కించి మిగిలిన డబ్బును చాటుగా తరలిస్తున్నట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పట్టుబడిన సూట్ కేసును మందిరం తెరిచిన రోజే ప్రశాంతి నిలయంలోని మరోచోటకు తరలించినట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, Sathya Sai Trust members may ready to condemne which amount was police hand overed yesterday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X