రాజీనామాతో వచ్చిన పిజెఆర్ తనయుడు విష్ణువర్ధన్
తన తండ్రి పిజెఆర్ తెలంగాణ కోసం, 610 జివో రద్దు కోసం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీపై అలుపెరగని పోరాటం చేశారని తాను కూడా తన తండ్రి బాటలోనే పయనిస్తానని అన్నారు. అవసరం వచ్చినప్పుడు రాజీనామాకు తాను సిద్ధమని పలుమార్లు ప్రకటించానని ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ కోసం సుమారు 600 మంది విద్యార్థులు చనిపోయారని ఆయన గుర్తు చేశారు. కాగా సభాపతి ఫార్మట్లో విష్ణు రాజీనామా చేశారు. అయితే అందులో ఆయన సెటిలర్స్ రక్షణ కోసం కొన్ని కండిషన్స్ పెట్టారు. సెటిలర్స్ కోసం కండిషన్స్ పెడితే రాజీనామా ఆలస్యమవుతుందని ప్రశ్నించగా మరో రాజీనామాతో వస్తానని చెప్పారు.
Comments
vishnuvardhan reddy pjr telangana congress manda jagannadham hyderabad పిజెఆర్ తెలంగాణ కాంగ్రెసు మందా జగన్నాథం హైదరాబాద్
English summary
Jubilee Hills MLA Vishnuvardhan come with resignation letter to Assembly today. He make some conditions in his letter for settlers.
Story first published: Monday, July 4, 2011, 10:00 [IST]