సిఎం మధ్యవర్తిత్వం, టి-మంత్రులు వెనక్కి తగ్గుతారా?

సబితారెడ్డి వంటి పలువురు మంత్రులు రాజీనామాకు అయిష్టంగానే అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇక నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సైతం రాజీనామాలు చేయలేదు. ఉద్యమ కార్యాచరణలో సైతం జానారెడ్డి, బస్వరాజు సారయ్య తదితర ఇద్దరు ముగ్గురు మంత్రులు మినహా ఎవరూ పాల్గొనడం లేదు. అయితే ఉద్యమాన్ని రూపొందిస్తున్న కెకె, జానారెడ్డి వంటి వారు మాత్రం మంత్రులంతా తమతోనే ఉన్నారని చెప్పుకొస్తున్నప్పటికీ మంత్రులు మాత్రం అధిష్టానంతో మాట్లాడడానికి మొగ్గు చూపడం గమనార్హం. తెలంగాణపై స్పష్టత వచ్చే వరకు తాము అధిష్టానంతో మాట్లాడేది లేదని కెకె వంటి వారు చెబుతుండగా మంత్రులు మాత్రం అందుకు విరుద్దంగా వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications