తెలంగాణవ్యాప్తంగా రైళ్లకు అడ్డుపడిన ఆందోళనకారులు
వరంగల్ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్లో తెలంగాణ వాదులు రైల్రోకో నిర్వహించారు. లింక్, చార్మినార్ ఎక్స్ప్రెస్లను తెలంగాణ నేతలు అడ్డుకున్నారు. వరంగల్ కాజీపేట స్టేషన్లో ఎర్నాకులం ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు.
నల్గొండ రైల్వే స్టేషన్లో ఐకాస నాయకులు పట్టాలపై బైఠాయించారు. చిట్యాల రైల్వే స్టేషన్లో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ను నిలిపివేసిన కార్యకర్తలను అరెస్టు చేశారు. వాడపల్లి విష్ణుపురంలో ఆందోళనకారులు రైలు పట్టాలపై బైఠాయించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్రోకో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బిజెపి నేత దత్తాత్రేయను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరని దత్తాత్రేయ ఈ సందర్భంగా అన్నారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాల- కాగజ్నగర్ ప్యాసింజర్ రైలును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. చర్లపల్లిలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ను తెలంగాణవాదులు నిలిపివేశారు. మహబూబ్నగర్ జిల్లాలో గూడ్స్ రైలుతో పాటు పలు రైళ్లను ఆపేశారు.