జగన్ కేసు పత్రాలు ఐటికి ఇవ్వండి: సిబిఐతో కోర్టు

సోదా పత్రాలు ఇవ్వడానికి తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని, అయితే కోర్టు అనుమతితో వాటిని తీసుకోవాలని సిబిఐ ఐటి శాఖలకు చెప్పింది. దీంతో బెంగళూర్ ఐటి శాఖతో పాటు రాష్ట్రానికి చెందిన ఐటి శాఖ కూడా విడివిడిగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ సోదా పత్రాలను ఐటి శాఖకు ఇవ్వాలనే విజ్ఞప్తిపై వైయస్ జగన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఏయే పత్రాలు కావాలో అడిగితే తాము ఐటి శాఖకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, సిబిఐ స్వాధీనం చేసుకున్న పత్రాల్లో వ్యక్తిగతమైనవి కూడా ఉన్నాయని, అందువల్ల వాటిని ఇవ్వకూడదని జగన్ తరఫు న్యాయవాది వాదించారు.












Click it and Unblock the Notifications