వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో పదేళ్లా?: రాహుల్‌గాంధీపై మాయావతి విమర్శలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mayawati
లక్నో: తమకు అధికారం ఇచ్చి చూడమంటున్న రాహుల్ గాంధీ పైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి లక్నోలో జరిగిన బహిరంగ సభలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెసు పార్టీ యుపిలో నలభై ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం సాధించిందో చెప్పాలన్నారు. ఇప్పుడు మరో పదేళ్లు అడుగుతున్న రాహుల్ గాంధీ గతాన్ని గుర్తుకు చేసుకుంటే మంచిదని సూచించారు. యుపి వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెసుది కాదని, పార్లమెంటులో అన్ని పార్టీలో కలిపి ఈ పథకాన్ని ఆమోదించాయన్నారు.

బిఎస్పీకి భయపడి రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా యుపిలో పర్యటిస్తున్నారన్నారు. యుపిలో తమ పార్టీ బలహీనంగా ఉండటం పట్ల ఆ పార్టీ ఆందోళన చెందుతోందని అందుకోసమే రాహుల్ పార్టీని బలపర్చడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారన్నారు. బిఎస్పీ హయాంలోనే దళితులకు, మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెసు ద్వారా వారికి న్యాయం జరగదన్నారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీకి కలలో కూడా బిఎస్పీ ఎన్నికల సింబల్ ఏనుగే కనిపిస్తోందన్నారు.

English summary
Continuing her attack on Rahul Gandhi, UP Chief Minister Mayawati on Sunday said he was so afraid of BSP that he was missing Parliament to campaign in UP and indulging in 'theatrics'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X