వైభవ్ జ్యువెల్లర్స్ మనోజ్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు

మనోజ్ మృతితో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగి పోయింది. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. మృతికి సంతాపంగా ఏలూరు, విశాఖ పట్టణ వ్యాపారస్తులు స్వచ్చంధంగా దుకాణాలు మూసి వేస్తున్నారు. మనోజ్ వజ్రాలు కొనేందుకు జైపూర్ వెళ్లారు. అటు నుండి హైదరాబాద్ వచ్చి, అక్కడి నుండి బెంగళూరు వెళ్లారు. బెంగళూరు నుండి ముంబయి వెళ్లే సమయంలో కిడ్నాప్ జరిగింది. మనోజ్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేత అంబికా కృష్ణ ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోజ్ వజ్రాల కొనుగోలు, యాడ్ ఫిల్మ్ కోసం వెళ్లినట్లు తనకు తెలిసిందన్నారు. ఆయన రాజస్థాన్ నుండి శంషాబాద్ అటు నుండి బెంగళూరు వెళ్లారన్నారు. విమానాశ్రయంలో సిసి కెమెరాలు పని చేయక పోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దుశ్చర్యలు జరక్కుండా పోలీసులు అడ్డుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications