కెసిఆర్ను అంటే నాలుక కోస్తాం: టిఆర్ఎస్, సస్పెన్షన్
తెలంగాణ కాంగ్రెసు, టిడిపి నేతలు తెలంగాణపై సభలో నోరు మెదపడం లేదన్నారు. ఈ ప్రభుత్వం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను కాలరాస్తోందన్నారు. తెలంగాణపై తీర్మానం చేయమంటే తమను సస్పెండ్ చేశారన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెసు, టిడిపిలకు బుద్ది చెబుతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు పట్టిన పీడ అని అన్నారు. టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు నిత్యం తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఏమైనా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కెసిఆర్ను ఏమైనా అంటే ఖబర్దార్ నాలుక కోస్తామన్నారు. దళిత కుటుంబంలో పుట్టిన మోత్కుపల్లి ఉన్నతంగా ఉండాల్సింది పోయి దిగజారారన్నారు.
కాగా సస్పెన్షన్కు గురైన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు... అరవింద్ రెడ్డి, హరీష్ రావు, కావేటి సమ్మయ్య, రవీందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, కెటి రామారావు, కొప్పుల ఈశ్వర్, నల్లాల ఓదేలు, విద్యాసాగర రావు, సోమారపు సత్యనారాయణ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. టిఆర్ఎస్ సభ్యులను సభ నుండి బహిష్కరించడం బాధాకరమని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.