హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదే అడ్డు, తేల్చలేం: టి-ఎంపీలకు ఆజాద్ షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad - Ponnam Prabhakar
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ శుక్రవారం షాక్ ఇచ్చారు. తెలంగాణ సమస్యను వెంటనే తేల్చలేమని వారికి స్పష్టం చేశారు. హైదరాబాదే విభజనకు అసలు అడ్డంకి అని ఆయన వారితో చెప్పారు. హైదరాబాద్ నగరం పైనే ఇరు ప్రాంతాల ప్రజలు, నేతలు పట్టుబడుతున్నారని ఆయన వారితో చెప్పారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందని ఆయన వారిని ప్రశ్నించారు. అందుకు ఎంపీలు ససేమీరా అన్నారు. లేదంటే కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఎలా ఉంటుందని ఆయన సూచించారు. ఎంపీలు ఆ ప్రతిపాదనను కూడా వ్యతిరేకించారు.

దీంతో ఆయన వారితో హైదరాబాద్ పైనే అందరూ పట్టుబడుతున్నారని, ఆ సమస్యకు పరిష్కారం చెప్పాలని వారికి సూచించారు. అలా కాని పక్షంలో తక్షణ పరిష్కారం తెలంగాణపై సులభం కాదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిదని, అది లేని తెలంగాణను మేం ఊహించుకోలేమని వారు ఆజాద్‌కు చెప్పారు. దీంతో ఆయన ఈ అంశంపై అంశంపై మరోసారి చర్చిద్దామని వారికి సూచించారు. కాగా ఆజాద్‌తో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఒప్పుకునేది లేదని చెప్పారు. తెలంగాణపై నాన్చడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పని చేయాలని సూచించామన్నారు. కాంగ్రెస్ పట్ల చిత్తశుద్ధితో ఉన్న తెలంగాణ ప్రాంత కార్యకర్తలు కావాలా, చిత్తశుద్ధి లేని సీమాంధ్ర నేతలు కావాలా అని తాము అధిష్టానాన్ని ప్రశ్నించామన్నారు.

English summary
Central minister Ghulam Nabi Azad give shock to Telangana Congress MPs today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X