హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీలక్ష్మిపై అభియోగాలు, సిబిఐ అదనపు చార్జిషీట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilaxmi
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిపై అభియోగాలు మోపుతూ సిబిఐ శుక్రవారం కోర్టులో అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమ మైనింగ్ కేసులో ఆమెను ఆరో నిందితురాలిగా పేర్కొంటూ సిబిఐ ఈ చార్జిషీట్ దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనుల తవ్వకాలకు శ్రీలక్ష్మి సహకరించారనేది ప్రధాన అభియోగం. కాప్టివ్ అనే పదాన్ని తొలగిస్తూ జీవో జారీ చేసి, అందుకు సహకరించారని శ్రీలక్ష్మిపై సిబిఐ ఆరోపణ చేసింది. శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వచ్చే నెల 2వ తేదీన విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టులు ఆమెపై అభియోగాలు మోపుతూ అదనపు చార్జిషీట్‌ను దాఖలు చేసింది.

కాగా, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ పాత్రపై కూడా సిబిఐ చార్జిషీట్‌లో వివరించినట్లు సమాచారం. అలీఖాన్‌ను ఒఎంసి కేసులో హైదరాబాదు తీసుకుని వచ్చేందుకు సిబిఐ ప్రయత్నాలు సాగిస్తోంది. ఎఎంసి కేసులో అతను ప్రస్తుతం బెంగళూర్ జైలులో ఉన్నాడు. ఒఎంసి కేసులో అలీఖాన్ రాజకీయ నాయకులకు, అధికారులకు ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపిస్తున్నారు. అలీఖాన్ ల్యాప్‌టాప్‌ను సిబిఐ ఇది వరకే స్వాధీనం చేసుకుంది. ఇందులో ఆ ముడుపులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒఎంసి కేసులో దాదాపుగా విచారణ పూర్తి అయింది. ఇప్పుడు ముడుపులు అందుకున్నవారిని సిబిఐ అరెస్టు చేస్తుందా, లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. 39 పేజీలు, 14 డాక్యుమెంట్లతో సిబిఐ అదనపు చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ అదనపు చార్జిషీట్‌ను రెండు ట్రంకు పెట్టెల్లో సిబిఐ కోర్టుకు చేర్చింది.

English summary
CBI has filed additional chargesheet in Gali Janardhan Reddy's illegal mining case in the court, framing allagations against Srilakshmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X