కుట్రదారులెవరో చెప్పండి: ఆచార్యకు శంకరరావు నోటీసు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 26 జీవోల విడుదలకు సంబంధించి మంత్రుల ప్రమేయం ఉందనే విషయం ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉందని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శనివారం కడపలో మీడియా ప్రతినిధులతో అన్నారు. మంత్రి కన్నా లక్ష్మినారాయణకు ఇచ్చిన నోటీసును తాను చూశానని, కన్నా జారీ చేసిన జీవోలో పస లేదని, కన్నా పాత్ర ఏమీ లేదని ఆయన అన్నారు. పారిశ్రామిక విధానంలో ఉన్న పరిస్థితిని బట్టి 2010లో జీవో జారీ అయిందని, కానీ మంత్రి కన్నా ఆ జీవోపై సంతకం చేయలేదని ఆయన అన్నారు. ఫైలు చూడనప్పటికీ కన్నాకు నోటీసు రావడమేమిటని ఆయన అడిగారు. మంత్రుల సంతకాలు లేకుండా జీవోలు విడుదలైన విషయంపై లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎవరు బాధ్యులనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications