అధిష్టానమే చూసుకుంటుంది: విహెచ్పై పురంధేశ్వరి

విజయవాడ పూర్ణానందం పేటలో నూతనంగా నిర్మించిన ఒక హోటల్ ప్రారంభోత్సవానికి ఆమె, ఆమె భర్త వెంకటేశ్వరరావు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హోటల్లోనే ఆమె మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. అయితే ఇటీవల నీతి, నిజాయితీలకు సంబంధించి బాగా చర్చ జరుగుతోందని, నైతిక విలువలు పాటించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్న విషయమై ఆమె బదులిస్తూ, బాధ్యతగల పదవులలో ఉన్న వ్యక్తులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, తప్పుచేస్తే నిజాయితీగా ఒప్పుకుని పదవి నుంచి వైదొలగడం మంచిదేనని చెప్పారు.
ఇలాంటి విషయంలో మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్నకు ఆమె భర్త, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందిస్తూ, నైతిక విలువలు పాటించాలనేది ఒకరు చెబితే నేర్చుకునేది కాదని, ఎవరికి వారే పాటించాలని, ఎవరి పరిధిలో వారే అవినీతికి పాల్పడకుండా ఉండడం మంచిదని సూచించారు. దీనిపై పురంధేశ్వరి స్పందిస్తూ, తమ విషయానికి వస్తే ఎటువంటి అనవసర వ్యాఖ్యలు చేయమని, చేతలలోనే చూపిస్తామన్నారు.
రాహుల్గాంధీని మంత్రి వర్గంలోకి తీసుకోవడంలో తప్పులేదన్నారు. ఆయనకు అందరి సహకారం ఉంటుందని, ఆయన కూడా అందరి సహకారంతో ముందుకు వెళతారని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంలో ఎవరి పరిధిలో వారు కృషి చేయడంలో తప్పులేదన్నారు. రాహుల్గాంధీ ప్రచారం వల్లే యుపీలో ఐదు శాతం ఓట్లు పెరిగిన విషయాన్ని గుర్తించాలని చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications