వైయస్, రోశయ్య అప్పులు నేను కట్టా: బాటలో కిరణ్
ఇంతకుముందు సిఎంల బకాయిలు తాను చెల్లిస్తున్నానని, అందులో భాగంగా రూ.8,300 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మత్సకారుల బడ్జెట్ను ఐదు రెట్లు పెంచామన్నారు. బడ్జెట్ను రూ.235 కోట్లు చేశామన్నారు. సముద్ర తీరాన ప్రాజెక్టులు, ఆయిల్ రిఫైనరీలతో మత్సకారులకు నష్టం జరుగుతోందన్నారు. మత్సకారుల పడవలకు డీజిల్ ధరలో సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కిరణ్ చెప్పారు.
అందరికీ విద్య అవసరమని కానీ, మత్సకారుల పిల్లలు మాత్రం విద్యకు దూరంగా ఉంటున్నారని, దానిపై తాను దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఓ హైస్కూల్ కోరారని, దానిని ఏర్పాటు చేస్తామన్నారు. సముద్రాలలో వచ్చే సునామీని కనుగొనే కేంద్రాన్ని హైదరాబాదులోనే పెట్టారని చెప్పారు. ఆధునిక యంత్రాల ద్వారా చేపలు ఎక్కడ బాగా పడతాయో కూడా మత్సకారులకు తెలుపవచ్చునని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
మత్సకారులకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా రూ.20 వేలు చెల్లించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు సౌకర్యాలు కల్పించామని, వచ్చే రెండేళ్లలో అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నాలా ఛార్జీల బకాయిలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మత్సకారుల వల్ల రాష్ట్రానికి రూ.11 కోట్ల ఆదాయం వస్తుందని, వారి డిమాండ్లను పరిశీలిస్తున్నామని, వాడ రేవు రోడ్ల నిర్మాణాన్ని కూడా వేస్తామని చెప్పారు. మత్సకారులకు సంవత్సరానికి రూ.50 కోట్లు ఖర్చవుతుందన్నారు.